హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS PECET) 2022 కు సంబంధించిన దేహ ధారుడ్య పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను సెప్టెంబర్ రెండో వారంలో నిర్వహిస్తామని కన్వీనర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. ఎలాంటి అపరాధ రుసుం చెల్లించకుండా ఆగస్టు 30వ తేదీ లోపు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. డీపీఎడ్, బీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీఎస్ పీఈసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తదితర వివరాల కోసం https://pecet.tsche.ac.in. అనే వెబ్సైట్ను సంప్రదించొచ్చు.