హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): తప్పిపోయి ముంబైలోని ఓ పోలీస్స్టేషన్కు వెళ్లిన తెలుగు మాట్లాడే వృద్ధురాలి ఫొటోను మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘తెలుగు మాట్లాడే ఈ అమ్మ తప్పిపోయి ముంబై శివాజీ పార్క్ పోలీస్స్టేషన్లో కూర్చొని ఉన్నది. దయచేసి మన తెలుగు గ్రూపుల్లో షేర్ చేయండి. మన బంధువుల్లో ఎవరి కుటుంబానికైనా చెందినవారు కావొచ్చు’ అని మహి అనే వ్యక్తి శనివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. కాసేపటికే దీన్ని కేటీఆర్ రీట్వీట్ చేశారు.