ఆదిలాబాద్ జిల్లాలో వైద్యులు వాగు దాటి వచ్చి ఆదివాసీలకు వైద్యం అందించారు. ఉట్నూర్ మండలంలోని దంతన్పల్లి పీహెచ్సీ వైద్యురాలు అనూరాధతోపాటు వైద్యుడు సంతోష్ శుక్రవారం వాగును దాటి వచ్చి జెండాగూడలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఆదివాసీలకు వైద్యం అందించారు. వైద్యుల చొరవకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. – ఉట్నూర్ రూరల్