హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : పీజీఈసెట్ ఫలితాలు గురువారం విడుదలకానున్నాయి. మధ్యాహ్నం 3 : 30 గంటలకు కూకట్పల్లి జేఎన్టీయూలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, వైస్చైర్మన్ వెంకటరమణ, వీసీ కట్టా నర్సింహారెడ్డిలు ఈ ఫలితాలను విడుదల చేస్తారని పీజీఈసెట్ కన్వీనర్ రవీంద్రారెడ్డి తెలిపారు. ఫలితాల కోసం https://pgecet.tsche.ac.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. మే 29 నుంచి ఈ నెల 1 వరకు జరిగిన పీజీఈసెట్ పరీక్షలకు16,563 దరఖాస్తులు రాగా, 14,882 (89.85శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారు. పీజీఈసెట్ ద్వారా ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.