హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని ప్రజాహిత పిటిషన్గా పరిగణించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రిట్ పిటిషన్గా మార్పు చేయాలని ఆదేశించింది. మహిళలకు ఉచిత ప్రయాణం కోసం ప్రభుత్వం జారీచేసిన జీవో 47ను సవాలు చేస్తూ హైదరాబాద్లోని నాగోల్కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఏ హరీందర్ పిల్ దాఖలు చేశారు. ఉద్యోగానికి వెళ్లడానికి ఇబ్బందిగా ఉంటున్నదని వాదించారు. వ్యక్తిగత ఇబ్బందులపై పిల్ దాఖలుకు వీల్లేదని, పిటిషన్గా మార్చాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే, జస్టిస్ జే అనిల్కుమార్ ధర్మాసనం బుధవారం పిటిషనర్ను ఆదేశించింది.