హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందజేసింది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు కూడా అనుమతి రావడంతో చార్జిషీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ సిద్ధమైంది.