వనపర్తి : ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని 2018 ఎన్నికలో ఇక్కడ దేవాలయం దగ్గర మాట ఇచ్చిన. ఇచ్చిన వాగ్ధానం మేరకు అన్ని హామీలను నెరవేర్చానని వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) అన్నారు. మంగళవారం మున్ననూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముం దుగా గ్రామంలో ఆంజనేయ స్వామి, శివాలయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు డప్పు చప్పుళ్లు, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాజకీయాల కోసం ఎవరు ఏమైనా మాట్లాడుతారు.
50 ఏండ్లు ప్రజలు అవకాశం ఇస్తే ఎం చేశారని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. అప్పుడు ఏం చేయలేదు కానీ ఇప్పుడు చేస్తాను అని చెబుతున్నారు అటువంటి వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఒక్క మున్ననూర్ గ్రామంలో 4 మినీ లిఫ్ట్ లను, 80 కరెంట్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశాం. అలాగే 40 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేశామని మంత్రి వివరించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మంద భార్గవి, ఎంపీపీ చంద్ర తిరుపతయ్య, గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు చంద్రయ్య, సర్పంచ్ శేఖర్ యాదవ్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సాయిరాం, మాజీ ఎంపీపీ జానకి, తిరుపతి రెడ్డి, సర్పంచులు రాజు, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.