జగిత్యాల : దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో పెన్షన్లు అమలు అవుతున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. పెన్షనర్ల డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మహిళలకు, వృద్ధులకు, వితంతువులకు ,దివ్యాంగులకు అత్యధికంగా ఆసరా పింఛన్లు అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు.
హెల్త్ కార్డ్ ఉన్న వారికి వైద్యసేవలందించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని పేర్కొన్నారు. బాధితులకు వైద్యపరంగా సేవలందించేందుకు అందుబాటులో ఉంటానని వెల్లడించారు. పెన్షనర్స్ భవనము లో ఆడిటోరియం నిర్మాణానికి ఐదు లక్షల నిధులు మంజూరు చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గంగ రాజం, అసోసియేట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ,కార్యదర్శి రవీందర్,క్యాషియర్ మల్లికార్జున్,యూనిట్ 1,2 అధ్యక్షులు రవీందర్,బాల మురళి కృష్ణ, స్టేట్ కౌన్సిలర్ అశోక్ రావు పాల్గొన్నారు.