హైదరాబాద్, మే 23(నమస్తే తెలంగాణ): గత వానకాలం సీజన్ (2021-22) సీఎమ్మార్ ఎగ్గొట్టిన మిల్లుల నుంచి 25 శాతం పెనాల్టీతో బియ్యం వసూలు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఆయా మిల్లు ల నుంచి బియ్యం రికవరీకి నిబంధనలను ఖరారు చేసింది. ఈ మేరకు మంగళవారం సివిల్ సైప్లె కమిషనర్ అనిల్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. గత వానకాలం సీఎమ్మార్ ఇచ్చేందుకు ఎఫ్సీఐ ఈ ఏడాది మార్చి 31 వరకు గడువు విధించింది. గడువు ముగిసినా 494 మంది మిల్లర్లు 2.22 లక్షల టన్నుల బియ్యాన్ని ఇవ్వలేకపోయారు. దీంతో డిఫాల్ట్ మిల్లర్ల నుంచి పెనాల్టీ వసూలు చేయాలని ఆ శాఖ నిర్ణయించింది. గడువు ముగిసే సమయానికి తమ దగ్గర ధాన్యం నిల్వలు ఉన్న మిల్లర్ల నుంచి 25 శాతం పెనాల్టీతో కలిపి 125 శాతం బియ్యం వసూలు చేయాలని నిర్ణయించింది. ఇందు లో 25 శాతం సీఎమ్మార్ అమౌంట్ను తక్షణమే చెల్లించడం ద్వారా మిగిలిన సీఎమ్మార్ ఇచ్చేందుకు అనుమతి పొందాలని పేర్కొన్న ది. మిగిలిన 100 శాతం సీఎమ్మార్ను రాష్ట్ర కోటాలో అందించాలని ఆదేశించింది. తర్వా త సీజన్లకు సంబంధించి ధాన్యం కేటాయింపు కోసం 12 శాతం అమౌంట్ చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తం సీఎమ్మార్ను 2023-24 వానకాలం సీజన్ ప్రారంభానికి ముందే అందించాలని ఆదేశించింది.