సూర్యాపేట : ముస్లిములకు పవిత్రమైన రంజాన్ పండుగలో ప్రార్థనలు, వారు చేసే ఉపవాసదీక్షలతో రాష్ట్రంలో శాంతి, సామరస్యం వెల్లివిరియాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagadish Reddy) ఆకాంక్షించారు. గురువారం సూర్యపేట(Suryapeta District) క్యాంపు కార్యాలయంలో రంజాన్(Ramzan) క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
పవిత్ర మాసంలో పేదలకు సేవ చేసేలా ప్రజల్లో స్ఫూర్తిని కలిగించాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సామరస్యం, కరుణ పెంపొందాలని పిలుపునిచ్చారు. అందరకీ అల్లా ఆశీస్సులు ఉండాలని కోరారు. గడిచిన ఎనిమిదేండ్లుగా తెలంగాణలో వెల్లివిరుస్తున్న శాంతి సామరస్యాలు ఈ ఏడాది కూడా కొనసాగే విధంగా ముస్లింలు ప్రార్ధనలు చేయాలని కోరారు.