మల్యాల, జూన్ 21: కొండగట్టు ఆలయంలో చోరీ కేసులో ప్రధాన నిందితులపై పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23న హనుమాన్ ఆలయంలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో కర్ణాటక రాష్ర్టానికి చెందిన ప్రధాన నిందితులైన రాంశెట్టి జాదవ్, బాలాజీ రాథోడ్, విఠల్రావును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్లోని చర్లపల్లి జైలుకు తరలించారు. వీరికి ఉన్న తీవ్రమైన నేర చరిత్రను పరిగణలోకి తీసుకొని జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్, డీఎస్పీ రత్నాపురం ప్రకాశ్ ఆదేశాల మేరకు మల్యాల సీఐ కోటేశ్వర్, ఎస్సై తీగల అశోక్ పీడీ యాక్ట్ పెట్టారు. ఈ మేరకు బుధవారం చర్లపల్లి జైలులో వీరికి ఉత్తర్వు కాపీలను అందించారు.