ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్కు వినతి
హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో కలపాలంటూ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ను వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు దండుగుల రాజ్యలక్ష్మి కోరారు. శుక్రవారం హైదరాబాద్లో వినోద్ను కలిసి వినతిపత్రం అందజేశారు. 1972 తర్వాత వడ్డెరలను ఎస్టీ జాబితానుంచి బీసీ (ఏ)లోకి మార్చడం వల్ల అన్నిరంగాల్లో వెనుకబడి ఉన్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇచ్చేలా కృషిచేయాలని కోరారు.