హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ఆఫీస్ సబార్డినేట్ల కోర్టు కేసు ముగిసిన నేపథ్యంలో వీఆర్ఏల నుంచి జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లుగా పేసేల్ కల్పించినవారికి వెంటనే ఎంప్లాయ్ ఐడీలు కేటాయించి, వేతనాలు చెల్లించాలని ట్రెసా ప్రతినిధి బృందం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సీసీఎల్ఏ, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి నవీన్మిట్టల్ను ట్రెసా ప్రతినిధి బృందం శనివారం ప్రత్యేకంగా కలిసి, విజ్ఞప్తి చేసింది. ఆఫీస్ సబార్డినేట్లకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించాలని కోరింది. దీనిపై మిట్టల్ సానుకూలంగా స్పందించినట్టు ట్రెసా బృందం తెలిపింది. కార్యక్రమంలో ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్కుమార్, ఉపాధ్యక్షుడు బాణాల రాంరెడ్డి, రమేశ్పాక, వివిధ జిల్లాల అధ్యక్షులు రమణ్రెడ్డి, సుధాకర్, వకీల్ తదితరులు పాల్గొన్నారు.