హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షాఫీజు చెల్లించేందుకు ఇంటర్బోర్డు మరో అవకాశం ఇచ్చింది. రూ.2 వేల ఆలస్య రుసుముతో మంగళవారం వరకు ఫీజు చెల్లించొచ్చని తెలిపింది.
షెడ్యూల్ ప్రకారం.. ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 19న ముగిసింది. మరికొంతమంది విద్యార్థులు ఫీజు చెల్లించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకొన్నారు.