(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టిన మొత్తం రూ. 45.03 లక్షల కోట్ల బడ్జెట్లో సింహభాగం వడ్డీల చెల్లింపునకే పోతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 10.79 లక్షల కోట్లను వడ్డీ చెల్లింపునకే ఖర్చుచేయనున్నారు. మొత్తం వ్యయంలో ఇది 24 శాతం. అంటే రమారమి రూపాయిలో పావలా వడ్డీకే ఖర్చు చేయనున్నట్టు అర్థమవుతున్నది. ఇదే సమయంలో గ్రామీణాభివృద్ధి, పింఛన్, ఆహార సబ్సిడీ, ఎరువులపై ఇస్తున్న సబ్సిడీకి ఇచ్చే నిధుల్లో కిందటేడాదితో పోలిస్తే ప్రభుత్వం గణనీయంగా కోత విధించింది. ఆహార సబ్సిడీపై ఏకంగా 31% కోత విధించింది.
బడ్జెట్ చెల్లింపులు వేటికంటే??