రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త పత్తిపాక మోహన్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు(2022)కు ఎంపికయ్యారు. ఆయన రాసిన ‘బాలల తాతా బాపూజీ’ గేయ కావ్యానికిగానూ ఈ పురస్కారం దక్కింది. ఈ మేరకు అకాడమీ బాధ్యులు బుధవారం పురస్కారాన్ని ప్రకటించారు. నేషనల్ బుక్ ట్రస్టు ఇండియాలో మోహన్ సహాయ సంపాదకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
బాలల కోసం వందల పుస్తకాలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి. కవి, రచయిత, విమర్శకుడు, బాలసాహితీవేత్తగా మహాకవి సీ నారాయణరెడ్డి నుంచి మోహన్ ప్రశంసలు అందుకొన్నారు. చిన్నప్పటి నుంచి రచనా వ్యాసంగంపై మక్కువ చూపిన ఆయన జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకొన్నారు. మోహన్ను బహుభాషావేత్త డాక్టర్ నలిమెల భాస్కర్, రాజన్న సిరిసిల్ల రచయితల సంఘం అధ్యక్షుడు ఎలగొండ రవి, ప్రధాన కార్యదర్శి వాసరవేణి పరశురాములు, ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్కు చెందిన వేద కుమార్, ప్రముఖ రచయిత జూకంటి జగన్నాథం, గర్రిపల్లి, జిందం అశోక్ తదితరులు అభినందించారు.
సీఎం కేసీఆర్ హర్షం
కేంద్ర సాహిత్య అకాడమీ ‘బాలసాహిత్య పురసారానికి’ డాక్టర్ పత్తిపాక మోహన్ ఎంపిక కావడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హర్షం వ్యక్తం చేశారు. ఆయన రాసిన ‘బాలల తాతా బాపూజీ గేయ కథ’కు ఈ పురసారం దకడం గొప్ప విషయమని అభినందించారు. గాంధీజీపై రాసిన బాల సాహిత్యానికిగాను తెలంగాణ సాహితీవేత్తకు ఈ అవార్డు దకడం, స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు మరింత శోభ వచ్చిందన్నారు. మోహన్ సాహిత్య రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తెలంగాణ సాహితీ రంగానికి మరింత వన్నె తేవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.