మెదక్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చే యడంలో ఘోరంగా విఫలమైందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప ట్లోళ్ల శశిధర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందగోకుల్ నుంచి చల్మెడ వరకు బీటీ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం 8 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రకు ప్రజలు దారి పొడువునా స్వాగతం పలికారు.
మార్గమధ్యంలో వ్యవసాయ కూలీలు, ప్రజలు వీరికి హారతులు ఇచ్చి స్వాగతించా రు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్రెడ్డి మా ట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం నందగోకు ల్ గ్రామం నుంచి చల్మెడ కమాన్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 13 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. తర్వాత కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక పనులు నిలిపివేసిందని ఆరోపించారు. కక్షపూరితంగా ప్రభు త్వం బీటీ రోడ్డు పనులు అడ్డుకుంటున్నదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని మండిపడ్డారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.