హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మైనింగ్, సమాచారశాఖల మంత్రిగా పట్నం మహేందర్రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం మొదటి అంతస్తులోని తన కార్యాలయంలో సతీమణి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతామహేందర్రెడ్డి, కుమారుడు రినీష్రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి.. మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సీఎస్ శాంతికుమారి, సమాచారశాఖ కమిషనర్ అశోక్రెడ్డి తన ముందుంచిన ఫైల్పై మంత్రి తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్, ఎర్రబెల్లి దయాకర్రావు పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో మంత్రి దంపతులను సన్మానించారు. ఎంపీ రంజిత్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ శంభీర్పూర్ రాజు, ఎమ్మెల్యేలు పట్నం నరేందర్రెడ్డి, మంచిరెడ్డి కిషన్రెడ్డి, ప్రకాశ్గౌడ్, కాలే యాదయ్య, అంజయ్యయాదవ్, మాధవరం కృష్ణారావు, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలుశాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి మహేందర్రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మంత్రికి సమాచార, పౌర సబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ కే అశోక్రెడ్డి, డైరెక్టర్ బీ రాజమౌళి పుష్పగుచ్ఛాలు అందజేశారు.అదనపు సంచాలకులు కే నాగయ్య, సీఐ ఈ రాధాకృష్ణ, జాయింట్ డైరెక్టర్ డీఎస్ జగన్, ఆర్ఐ ఈ రాములు, ఉప సంచాలకులు మధుసూదన్, వెంకటేశ్వర్లు, రాజారెడ్డి, హష్మీ, ప్రసాదరావు, సురేశ్, మీడియా అకాడమీ సెక్రటరీ వెంకటేశ్వరరావు ఇతర అధికారులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.