హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల పాస్పోర్ట్ సేవలు నిలిపివేసినట్టు హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తుదారులు ఈ రోజు ఉన్న అపాయింట్మెంట్స్ రీషెడ్యూల్ చేసుకోవాలని సూచించారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీస్ పాస్పోర్ట్ కేంద్రాలు, పాస్పోర్ట్ సేవాకేంద్రాల్లో సేవలు అందుబాటులో ఉండవని తెలిపారు. పాస్పోర్ట్ సేవా పోర్టల్లో తమ అపాయింట్మెంట్ స్థితిని తనిఖీ చేసుకోవాలని సూచించారు. www.passportindia.gov.in లో తమ అపాయింట్మెంట్లను రీషెడ్యూల్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. రిజిస్టర్ మొబైల్ నంబర్లకు అపాయింట్మెంట్స్ వివరాలు ఎస్ఎంఎస్లు అందుతాయని చెప్పారు. ఈ అసౌకర్యానికి దరఖాస్తుదారులు సహకరించాలని ఆయన కోరారు.