హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : పార్ట్టైమ్ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేసినట్టు జేఎన్టీయూ అధికారులు తెలిపారు. ఫలితాల వివరాలను జేఎన్టీయూ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్టు వెల్లడించారు.
జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 16 వరకు పార్ట్టైమ్ పీహెచ్డీ ప్రవేశ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే.