హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్గా పరాంకుశం వేణుగోపాల్ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. నియామక సిఫార్సులు గవర్నర్కు పంపినట్టు, ఆమోదం కూడా తెలిపినట్టు న్యాయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఇప్పటివరకూ కొత్త ఏజీగా డీ ప్రకాశ్రెడ్డి, నిరూప్రెడ్డి, గిరిధర్రావు, మహేందర్రెడ్డి, సుదర్శన్రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయనే ఊహాగానాల నేపథ్యంలో శుక్రవారం అనూహ్యంగా పీ వేణుగోపాల్ పేరు తెరపైకి వచ్చింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ హైకోర్టు అడ్వొకేట్ జనరల్గా వేణుగోపాల్ పనిచేశారు. వేణుగోపాల్ పూర్వీకులది ఒడిశాలోని బరంపురం. చాలా ఏండ్ల క్రితమే సికింద్రాబాద్లో స్ధిరపడ్డారు. ఆయన 1954 నవంబర్ 23న జన్మించారు. సికింద్రాబాద్లోనే విద్యాభ్యాసం చేశారు. 1977లో ఓయూ నుంచి లా పూర్తి చేసి, అదే ఏడాది డిసెంబర్ 22న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది రంగనాథన్ వద్ద జూనియర్గా చేశారు. 1983 1989 వరకు ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా చేశారు. 2002లో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.