హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతులు, నిర్వహణకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రూ.6 వేల కోట్లను కేటాయించారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. శనివారం రాజేంద్రనగర్లోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆ శాఖ ఇంజినీరింగ్ ఉన్నతాధికారులతో వర్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 67 వేల కిలోమీటర్ల పీఆర్ రోడ్లు ఉన్నాయని, వీటి మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ ఏడాది రూ.3 వేల కోట్లు, వచ్చే సంవత్సరం మరో రూ.3 వేల కోట్లను సీఎం కేసీఆర్ కేటాయించారని తెలిపారు. పనుల ప్రగతిపై ప్రతి మూడు నెలలకోసారి ఇంజినీర్ ఇన్ చీఫ్ సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. ఈ నెల 22 కల్లా రోడ్ల మరమ్మతులు, నిర్వహణ ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. డిసెంబర్ 15లోపు పనులు మొదలు కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని గుర్తుచేశారు. ఈ సమావేశంలో పీఆర్, ఆర్డీ శాఖల కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఇంజినీర్ ఇన్ చీఫ్ సంజీవరావు, చీఫ్ ఇంజినీర్ తదితరులుపాల్గొన్నారు.