హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో ముస్లిం మైనారిటీ యువతులకు వివాహం సందర్భంగా ఆర్థికసాయం అందించేందుకు ఉద్దేశించిన దుల్హన్ పథకాన్ని నిలిపివేసినట్టు హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పథకం ప్రస్తుతం అమలులో లేదని పేర్కొన్నది.
టీడీపీ హయాంలో దుల్హన్ పథకం కింద పేద ముస్లిం మహిళల వివాహానికి రూ.50 వేలు అందజేశారు. ఈ పథకం నిలివేయడాన్ని సవాల్ చేస్తూ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షారూఖ్ షిబ్లి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. ఆర్థిక ఇబ్బందుల వల్లే ప్రభుత్వం పథకాన్ని అమలు చేయలేకపోతుందని తెలిపారు.