వరంగల్ : కరోనా చికిత్సకు అవసరమైన ఆక్సిజన్ కొరత రాకుండా సీఎం కేసీఆర్ పటిష్టమైన చర్యలు చేపడుతున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆందులో భాగంగానే స్త్రీనిధి ద్వారా రూ.50లక్షల విలువైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు రాష్ట్రంలోని 8 ప్రభుత్వ దవాఖానలకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు.
హైదరాబాద్లోని టిమ్స్ దవాఖానకు-10, వరంగల్లోని ఎంజీఎం-5, వరంగల్ రూరల్ జిల్లాలోని రాయపర్తి, పర్వతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు-4 చొప్పున మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్ దవాఖానకు-10, జనగామ జిల్లాలోని కొడకండ, పాలకుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 3 చొప్పున, దేవరుప్పుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి-4 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ధైర్యం కోల్పోవద్దు..నిర్లక్ష్యం చేయొద్దు
వైద్యుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి నిరంజన్ రెడ్డి
కొవిడ్ బాధితులకు అండగా ఉంటాం : మంత్రి ఎర్రబెల్లి
సిద్దిపేట లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
మనోధైర్యమే అసలైన మందు : మంత్రి నిరంజన్ రెడ్డి