హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ ) : గ్రూప్ -1కు భారీగా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నా యి. అధికారుల అంచనాలను దాటి మంగళవారం నాటికి 1,33,886 దరఖాస్తులు నమోదయ్యాయి. 2,47,097 మంది ఓటీఆర్లో మార్పులు చేసుకోగా, 1,17, 548 మంది కొత్తగా ఓటీఆర్ను నమోదుచేసుకున్నట్టుగా టీఎస్పీఎస్సీ అధికారులు వెల్లడించారు.