ఖైరతాబాద్, జూలై 7: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిది కుల దురహంకార ధోరణి అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి ఓరుగంటి వెంకటేశం గౌడ్ అన్నారు. పార్టీలో బడుగు, బలహీన వర్గాలను అణచివేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ ఉంటే వందేండ్లయినా ఆ పార్టీ అధికారంలోకి రాదని, కనీసం పది సీట్లు కూడా గెలవదని విమర్శించారు. కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన ఆయన సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం మీడియాతో మాట్లాడారు.
30 ఏండ్లపాటు బీసీలకు న్యాయం కోసం పోరాడానని, కాంగ్రెస్లో చేరి ఉద్యమంలోనూ ప్రముఖ పాత్ర పోషించానని, కానీ ఇప్పుడు నియంతృత్వ, నిరంకుశ రేవంత్ రెడ్డి హయాంలో పనిచేయలేనని అన్నారు. ఆ పార్టీతో బడుగులకు వందేండ్లయినా న్యాయం జరుగదని, అందుకే రాజీనామా చేస్తున్నానని తెలిపారు. రేవంత్ ఒక కులానికి నాయకత్వం వహిస్తూ రాష్ట్రంలో 50 శాతం ఉన్న బలహీన వర్గాల నాయకులను అణచివేస్తున్నారని, వారి పదవులను తొలగిస్తూ తన అనుయాయులను నియమించుకొంటున్నారని ఆరోపించారు.
119 నియోజకవర్గాల్లో తన సామాజికవర్గానికే ప్రాధాన్యం ఇవ్వాలన్న రహస్య ఎజెండాతో పనిచేస్తున్నారని, ముఖ్యమంత్రి పదవుల్లో సైతం వారే ఉండాలని ఆలోచిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసిన 1,200 మందిలో బడుగు, బలహీనవర్గాలకు చెందినవారే ఉన్నారని, ఆ సమయంలో రేవంత్ చంద్రబాబు పంచన చేరి ఉద్యమాన్ని అణచివేయాలని చూశారని ఆక్షేపించారు. పీసీసీ అధ్యక్షుడైనంత మాత్రాన తనకు తాను ముఖ్యమంత్రిగా ఫీలవుతున్నాడని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
టీఆర్ఎస్ సర్కారుతోనే రాష్ట్రంలోని బడుగులకు న్యాయం జరుగుతుందని వెంకటేశంగౌడ్ తెలిపారు. కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. గురువారం మంత్రి కేటీఆర్ను కలిసి కాంగ్రెస్కు ఎందుకు రాజీనా మా చేశానో వివరించానని, టీఆర్ఎస్ చేరుతానని చెప్పడంతో స్వాగతించారన్నారు. త్వరలోనే వందల మంది తో గులాబీ కండువా కప్పుకొంటానని స్పష్టం చేశారు. కేటీఆర్ను కలిసిన సమయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి అక్కడే ఉన్నారు.
rgned from in protest againsts attitude