హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఇరు రాష్ర్టాలకు నీటి విడుదలకు కేఆర్ఎంబీ ఉత్తర్వులు జారీ చేసింది. మే మాసాంతం వరకు ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కోసం కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ, తెలంగాణ, ఏపీ ఈఎన్సీలతో కూడిన త్రిసభ్య కమిటీ ఇటీవల సమావేశమైంది. సాగర్ రిజర్వాయర్ ఎండీడీఎల్ 510 ఫీట్లు కాగా, 500 ఫీట్లకు తగ్గించి మొత్తంగా 14 టీఎంసీలు వినియోగానికి అందుబాటులో ఉన్నాయని తేల్చారు. అందులో తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలను కమిటీ కేటాయించగా, తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.