హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : 2023 – 24 విద్యాసంవత్సరానికి పదోతరగతి, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాల గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్టు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. షెడ్యూల్ ప్రకారం 16న ప్రవేశాలకు తుది గడువు కాగా, అభ్యర్థులకు మరోసారి అవకాశం ఇచ్చామని పేర్కొన్నారు.
అభ్యర్థులు https://www. telanganaopenschool.org వెబ్సైట్ను సంప్రదించి అడ్మిషన్లు పొందాలని సూచించారు.