హైదరాబాద్ : శాసన మండలి సభ్యుడిగా ఒంటేరు యాదవ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలోని తన చాంబర్లో మండలి ప్రొటెమ్ చైర్మన్ జాఫ్రీ ఒంటేరు యాదవ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డికి మంత్రి హరీశ్ రావు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.