Civils Prelims | హైదరాబాద్ : తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్కు కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 16వ తేదీన ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ను నిర్వహించనున్నారు. ఈ మేరకు స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మొత్తంగా ఉచిత కోచింగ్కు 150 మందిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. గతంలో సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు నేరుగా అడ్మిషన్ అందిస్తామని వివరించారు. పూర్తి వివరాలకు 040 27077929, 77803 59322 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.