అయిజ, మే 24: కర్ణాటకలోని తుంగభద్ర జలాశాయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు డ్యాంలోకి వరద వచ్చి చేరుతున్నది. మంగళవారం 15,665 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 356 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. గరిష్ఠ నీటి నిల్వ 100.855 టీఎంసీలకు గాను ప్రస్తుతం 33.365 టీఎంసీల నిల్వ ఉన్నదని బోర్డు ఎస్ఈ నాగమోహన్, డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. ఆర్డీఎస్ ఆనకట్టకు 3,292 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి 2,800 క్యూసెక్కులు చేరుతున్నట్లు ఆర్డీఎస్ కర్ణాటక ఏఈ శ్రీనివాస్ తెలిపారు.