నాంపల్లి కోర్టులు, మే 29 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్కుమార్ స్నేహితుడు నర్సింగ్రావును సోమవారం సిట్ అధికారులు జువెనైల్ కోర్టులో హాజరు పర్చగా, మెజిస్ట్రేట్ జీ రాధిక జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించారు. ప్రవీణ్ తరఫున వేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. మరోసారి రేణుకరాథోడ్కు సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారని, నూతన్ రాహుల్కుమార్ అలియాస్ గంభీరం పురేందర్, రేణుక మధ్య జరిగిన సంఘటనల గురించి విచారించారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కస్టడీ సైతం ముగిసిందని చెప్పారు. దామినేని రవితేజ, సాయిలౌకిక్, సుస్మిత దంపతుల మధ్య జరిగిన విషయాలపై సిట్ పోలీసుల విచారణ పూర్తయ్యిందని రవితేజ తరఫు న్యాయవాది తెలిపారు. సిట్ పీపీ మాత్రం ఇంకా విచారణ పూర్తి కాలేదని వ్యతిరేకించారు. సుచరితరెడ్డి బెయిల్ పిటిషన్ను కొట్టి వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.