హైదరాబాద్: నగర శివార్లలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతిచెందగా, ముగ్గురు గాయపడ్డారు. కీసర సమీపంలోని అహ్మద్గూడ వద్ద డంపింగ్ లారీ బైకును ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరు తీవ్రంగా గాయడపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు.
మరో ఘటనలో హిమాయత్సాగర్ వద్ద ఔటర్ రింగురోడ్డుపై కోళ్ల వ్యాన్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. కోళ్ల లోడుతో బొలేరో వాహనం శంషాబాద్ నుంచి రాజేంద్రనగర్ వైపు వెళ్తున్నది. అయితే హిమాయత్సాగర్ వద్ద టైరు పంచర్ కావడంతో అది పల్టీ కొట్టింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.