సూర్యాపేట: జిల్లాలోని జాజిరెడ్డిగూడెం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తిమ్మాపురం వద్ద జనగామ-సూర్యాపేట జాతీయ రహదారిపై (Jangaon-Suryapet highway) రెండు బొగ్గు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రమాదానికి గురైన లారీలను రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.