హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): రైతుల ఫిర్యాదుతో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్సింగ్ సోమవారం కామారెడ్డి జిల్లా పిట్లంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం, రైస్మిల్లును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ నెలకొన్న ధాన్యం రవాణా సమస్యను వెంటనే పరిష్కరించారు.
రవాణా, రైస్ మిల్లుల తరుగు విషయంలో అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మిల్లులు సరిపోకపోవడంతో మరో మిల్లును ట్యాగ్ చేయాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వెంటనే చైర్మన్ స్పందించడంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు.