హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగష్టు 11 (నమస్తే తెలంగాణ): ఒమన్ యువరాజు ఫిరాజ్ బిన్ ఫతీక్ శుక్రవారం టీహబ్ను సందర్శించారు. టీ హబ్ కేంద్రంగా ఉన్న పలు స్టార్టప్ కార్యకలాపాలను తెలుసుకున్నారు.
అనంతరం టీఎస్టీఎస్) చైర్మన్ జగన్మోహన్రావు, వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ కన్వీనర్ సందీప్కుమార్ మక్త తదితరులతో సమావేశమయ్యారు. సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయం, ట్రాఫిక్ ఇంటిగ్రేటెడ్ సిస్టం, ఈ-గవర్నెన్స్, ఎం-గవర్నెన్స్ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు.