హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులు, వృద్ధులు, ఉద్యోగుల కోసం 28 వేల పోస్టల్ బ్యాలెట్ల ముద్రణను అధికారులు శనివారం పూర్తిచేశారు. 22 కల్లా ఈవీఎంల తనిఖీలు పూర్తి చేయాలని ఈసీ ఆదేశించగా, అధికారులు ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు.
బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను నియోజకవర్గాలకు కేటాయించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల కమిషన్కు వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు రూ.603 కోట్ల విలువైన నగదు, నగలు, ఇతర వస్తువులను పట్టుకున్నారు. అలాగే, వివిధ పార్టీల స్టార్ క్యాంపెయినర్ల జాబితాను అధికారులు విడుదల చేశారు.