మల్హర్, ఫిబ్రవరి 9 : బలవంతంగా భూసేకరణ, లీజు ప్రతిపాదనతో అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని, వారి నుంచి తమకు ప్రాణభయం ఉన్నదని భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల, కాపు రం భూ నిర్వాసితులు పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లో మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త అధికారులను కలిసి ఫిర్యా దు చేసినట్టు జెన్కో భూ నిర్వాసిత హక్కుల సాధన పోరాట కమిటీ అధ్యక్షుడు కేసారపు రవి తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 7న సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో జెన్కో అధికారులు మళ్లీ లీజు ప్రతిపాదనపై సమావేశం నిర్వహించారని తెలిపారు. గ్రామస్తులు తిరస్కరించినప్పటికీ అధికారులు పదే పదే సమావేశాల పేరుతో పిలిపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. లీజు ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని కోరారు.