హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను అధికారికంగా చేపట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.