Officers Transfers | రాష్ట్రంలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు శాఖల్లో అధికారులను బదిలీలు చేసిన సర్కారు.. తాజాగా గనులు, భూగర్భ వనరుల శాఖలో భారీగా అధికారులకు స్థానచలనం కలిగించింది. ముగ్గురు డిప్యూటీ డైరెక్టర్లు, 21 మంది అసిస్టెంట్ డైరెక్టర్ల, 22 మంది అసిస్టెంట్ జియాలజిస్టులు, 33 మంది రాయల్టీ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.