హైదరాబాద్, సెప్టెంబర్ 19(నమస్తే తెలంగాణ): ఒడిశా మంత్రి అటాను సబ్యసాచి నాయక్ మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టెస్కాబ్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా సహకార బ్యాంకుల్లో టెస్కాబ్ అమలు చేస్తున్న విధానాలను పరిశీలించడంతోపాటు అమలు చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయన పరిశీలించారు. నాఫ్కాబ్ అవార్డులు అందుకున్న టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, ఎండీ మురళీధరన్కు ఒడిశా మంత్రి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.