హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తి నేపథ్యంలో రా్రష్ట్రంలోని డిగ్రీ కాలేజీలకు సైతం సెలవులు ఇవ్వాలని కళాశాల విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఉన్నత విద్యామండలి నుంచి యూనివర్సిటీల వారీగా విద్యాసంవత్సరాన్ని ఎప్పటివరకు ఖరారుచేశారు, ఎప్పటివరకు సెలవులు ఇవ్వొచ్చు అన్న అంశాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే విద్యాసంస్థలు మూతపడగా, డిగ్రీ కాలేజీల్లో ప్రస్తుతానికి ఆన్లైన్ క్లాసులను నిర్వహిస్తున్నారు. అధ్యాపకులంతా విధులకు హాజరై ఆన్లైన్ తరగతులను పర్యవేక్షిస్తున్నారు. పలువురు సిబ్బంది కరోనా బారినపడ్డారని, సెలవులు ఇవ్వాలని అధ్యాపకులంతా విజ్ఞప్తిచేస్తున్నారు.