వికారాబాద్ : రక్తహీనత తక్కువగా ఉన్న తొమ్మిది జిల్లాలో లక్షా 25వేల మంది గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను ప్రభుత్వం అందజేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలో కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ల పంపిణీని ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల ఆర్యోగ రక్షణకు శ్రీకారం చుట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. వికారాబాద్ జిల్లా లో ఎనీమియా 79 శాతంగా ఉందని అందువల్లనే ఈ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. వికారాబాద్ జిల్లాలో 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు యూపీహెచ్సీలలో4461 మందికి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 13,90,634 మంది లబ్ధిదారులకు, రూ. 243 కోట్లు విలువ చేసే 12,85,563 కేసీఆర్ కిట్లను పంపిణీ చేశామన్నారు.