జ్యోతినగర్, మార్చి 31: విద్యుత్తు ఉత్పత్తిలో రామగుండం ప్రాజెక్టులు రికార్డు సృష్టించాయని ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్కుమార్ తెలిపారు. ఎన్టీపీసీలో 2,600 మెగావాట్లతోపాటు సోలార్, ఫ్లో టింగ్ సోలార్ ప్లాంట్ల ద్వారా 4,310 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి జరుగుతుందని ఆయ న పేర్కొన్నారు. శుక్రవారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాలులో ఎన్టీపీసీ యాజమా న్యం నిర్వహించిన మీడియాతో ముఖాముఖిలో ఈడీ సునీల్కుమార్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకా రం తెలంగాణకు కేటాయించిన 4 వేల మెగావాట్లలో ఫేజ్-1 కింద నిర్మిస్తున్న 1,600 మెగావాట్ల సామ ర్థ్యం కలిగిన తెలంగాణ సూ పర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును నిర్మించినట్టు తెలిపారు.
అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో చేపడుతున్న ప్రాజెక్టులో మొదటగా చిమ్నీ నిర్మా ణం పూర్తి చేశామన్నారు. గత మార్చి 24న 800 మెగావాట్ల ఒకటో యూనిట్లో విద్యుదుత్పత్తిని ప్రారంభించి ప్రస్తుతం పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తున్నట్టు చెప్పారు. అలాగే మరో 800 మెగావాట్ల రెండో యూనిట్ నిర్మాణం పనులు తుదిదశలో ఉన్నాయని తెలిపారు. ఎఫ్జీడీ నిర్మాణం, యాష్ హ్యాండ్లింగ్ సిస్టమ్ పూర్తితో స్టీమ్ బ్లోయింగ్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వచ్చే జూన్ నాటికి యూనిట్ను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 15,498 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ ఉన్నదని, ఎండల తీవ్రత అధికమైతే మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఫేజ్-2 కింద 2,400 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణ పనులను అగ్రిమెంట్ జరిగిన వెంటనే ప్రారంభిస్తామని తెలిపారు.