వరంగల్ : ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్ కోటా సీట్లకు భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 20వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 26వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు పరిశీలించిన అనంతరం మెరిట్ జాబితాను యూనివర్సిటీ విడుదల చేయనున్నది. మరిన్ని వివరాల కోసం యూనివర్సిటీ వెబ్సైట్ www.knruhs.telangana.gov.inలో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో సూచించాయి.