Singareni | కొత్తగూడెం సింగరేణి, ఫిబ్రవరి 22: సింగరేణివ్యాప్తంగా తొలివిడతగా ఖాళీగా ఉన్న 272 పోస్టులను భర్తీ చేస్తామని సింగరేణి సీఎండీ బలరాం గురువారం రాత్రి ప్రకటించారు. ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో మేనేజ్మెంట్ ట్రైనీ (మైనింగ్) ఈ2 ట్రేడ్ 139 పోస్టులు, మేనేజ్మెంట్ ట్రైనీ (ఎఫ్ అండ్ ఏ), ఈ2 గ్రేడ్ 22 పోస్టులు, మేనేజ్మెంట్ ట్రైనీ (పర్సనల్) ఈ2 గ్రేడ్ 22 పోస్టులు, మేనేజ్మెంట్ ట్రైనీ (ఐఈ) ఈ2 గ్రేడ్ 10 పోస్టులు, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ ఈ1 గ్రేడ్ పది పోస్టులు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.
మేనేజ్మెంట్ ట్రైనీ (హైడ్రో జియాలజిస్ట్) ఈ2 గ్రేడ్ 2 పోస్టులు, మేనేజ్మెంట్ ట్రైనీ (సివిల్) ఈ2 గ్రేడ్ 18 పోస్టులు, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ ఈ1 గ్రేడ్ మూడు పోస్టులు ఉన్నట్టు ఆయన తెలిపారు. జనరల్ డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ (జీడీఎంవోస్) ఈ3 గ్రేడ్ 30 పోస్టులు, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో సబ్ ఓవర్సీర్ ట్రైనీ (సివిల్) ఈఅండ్ఎస్ గ్రేడ్-సీలో 16 పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. మార్చి 1 నుంచి 18లోపు దరఖాస్తు చేసుకోవాలని సీఎండీ సూచించారు.