Telangana | హైదరాబాద్ : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మొత్తం 5,204 స్టాఫ్నర్సుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈసారి ఎంట్రెన్స్ పరీక్షలను ఓఎంఆర్ విధానంలో కాకుండా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహించనున్నది. వచ్చే ఆగస్టు 2న పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మరిన్ని వివరాల కోసం https://mhsrb.telangana.gov.in అనే వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.