హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)లో పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షలకు వసూలు చేసే ఫీజు నుంచి ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపు ఇవ్వాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి, ఇంటెలిజెన్స్ బ్యూరోకు నోటీసులు జారీచేసింది. ఐబీలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారుల పోస్టుల నియామకం కోసం 2023 నవంబర్ 25న కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్పై హైదరాబాద్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ జే విప్లవ్బాబు వ్యక్తిగత హోదాలో పిల్ వేశారు.