గజ్వేల్, సెప్టెంబర్ 20: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల పరిధిలోని ఎర్రవల్లిలో సర్వే నంబర్ 325లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు రెవె న్యూ అధికారులు నోటీసులు అందజేశారు. గ్రామ పంచాయతీ వద్ద ఒక్కొక్కరికి నోటీస్లను ఇచ్చారు. 215 మంది రైతులకు విడతలవారీగా నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
ఇప్పటికే గ్రామానికి చెందిన సుమారు వంద మందికిపైగా రైతులకు అందజేశారు. నోటీసులు అందుకున్న రైతులు సోమవారం నుంచి కొనసాగనున్న సర్వేలో ఆధారాలతో పొజిషన్ వద్దకు వచ్చి సర్వే అధికారులకు హద్దులు చూపించి సహకరించాలని కోరారు. మొత్తం 388.05 ఎకరాల విస్తీర్ణం ఉండడంతో నాలుగు విడతలుగా సర్వే చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు.