హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇక కాంగ్రెస్ పని అయినట్టేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు మొట్టికాయలు వేయగానే పులిలా గాండ్రించిన దానం నాగేందర్, 24గంటలు తిరుగకముందే పిల్లిలా సుప్రీంకోర్టు మెట్లెక్కారని విమర్శించారు. ఫైటర్ను అంటూనే సుప్రీం కోర్టులో పిటిషన్ ఎందుకు వేశారో దానం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
ఈ మొత్తం డ్రామా వెనుక ఉన్న అసలు సూత్రధారి సీఎం రేవంత్రెడ్డేనని స్పష్టం చేశారు. ఖైరతాబాద్లో ఉపఎన్నిక వస్తే కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవుతుందనే భయంతోనే దానం నాగేందర్ను పావుగా వాడుకుంటూ కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని మండిపడ్డారు. రేవంత్రెడ్డికి తన పరిపాలనపై నమ్మకం, ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే ఖరీదైన లాయర్ల వెనుక దాకోవడం మానేసి వెంటనే ఖైరతాబాద్ ఉప ఎన్నికను నిర్వహించాలని సవాల్ విసిరారు. అకడ దానం నాగేందర్ను నిలబెట్టినా, రేవంత్రెడ్డి స్వయంగా పోటీ చేసినా బీఆర్ఎస్ గెలుపు తథ్యమని స్పష్టంచేశారు. రేవంత్ సరార్ తోలు బొమ్మలాటకు చరమగీతం పాడేందుకు ఖైరతాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తేల్చి చెప్పారు.